ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: షి టీమ్ పోలీసులు

ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: షి టీమ్ పోలీసులు

  నమస్తే భారత్ /  నారాయణపేట్ జిల్లా : జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, బస్సులలో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల ఉపయోగం, రోడ్డు భద్రత నియమాలు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీమ్ పోలీసులు బాలరాజు మాట్లాడుతూ.ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని లాటరీ తగిలిందని, తక్కువడ్డికి లోన్ ఇస్తామని, గిఫ్ట్ ప్యాక్ లు వచ్చయి అని, తక్కువ రేట్ కి వాహనాలు దొరుకుతాయని, ఎవరైనా పై అధికారి వాట్సాప్ డీపీ పెట్టుకుని వాట్సాప్ లో మెసేజ్ చేసి డబ్బులు పంపమని అడిగితే పంపరాదు అని, మొబైల్ ఫోన్లో బ్లూ లింక్స్ ఓపెన్ చేయరాదని, ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పరాదని మొదలగు మోసపూరిత ఆశలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అనుకోకుండా సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.అలాగే బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లగేజ్ బ్యాగులు విలువైన వస్తువులు, డబ్బులు, కిటికీల దగ్గరకు కూర్చున్నప్పుడు బంగారు గొలుసులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ పోలీసులు జ్యోతి, కవిత, ప్రజలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం