పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు
జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపియస్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : బుధవారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ ఎన్ లింగయ్య తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ రవాణా జరగకుండ మక్తల్ పట్టణంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో, పన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుతది అని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎచ్ సి బలరాం, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ నరేందర్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
