స్వయం ఉపాధికి కార్యాచరణ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

స్వయం ఉపాధికి కార్యాచరణ వేగవంతం చేయాలి

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

తేదీ, మే 06, 2025 -
నమస్తే భరత్

నిర్మల్:-పట్టణంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకం పై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్  సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్  మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్‌లను సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి ఈ నెల 20 తేదీలోగా జిల్లా స్థాయి కమిటీకి పంపించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న యూనిట్లను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలనకు బ్యాంకులు వేగంగా స్పందించాలని, రోజువారి నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
 అనంతరం మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు, ఇప్పటి వరకు వాటి పరిశీలన స్థితి, బ్యాంకులవారీగా టార్గెట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఎల్.డి.ఎం రాంగోపాల్, మండలాల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు. ఎంపిడిఓలు, వివిధ బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు