భారత్ మాతాకీ జై అంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు
నమస్తే భారత్ / మద్దూరు, (మే 7) : పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడి చేయడంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఏ ఇద్దరు కలిసిన ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు . ఈ సందర్భంగా మద్దూరు పట్టణ కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా పాకిస్తాన్ కు సరైన శాస్త్రి జరిగిందని మాట్లాడుకుంటున్నారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతిదాడి చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి , ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న వీర సైనికులకు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలుపుతున్నారు. ముస్కరులు చేసిన దాడులకు ప్రతి దాడులుగా భారత సైన్యం పాకిస్తాన్ కు తిరిగి గట్టి సమాధానం చెప్పినందున పుష్కరుల దాడిలో అమరులైన వారి కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
