హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలాగే నిజమైన లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వడంలేదని ఇవ్వడం లేదని ఇళ్ళు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం సమంజసం కాదన్నారు. . రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటూ మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొడంగల్ ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు సంతోషపడతారు ఇప్పటికే రెండు సంవత్సరాలు కావస్తుంది ముఖ్యమంత్రి అయ్యికూడ ఎటువంటి అభివృద్ధి కాలేదు. కొత్తపల్లి మండలంలో ప్రతిరోజు దర్జాగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ఏ ఒక్కరు పట్టించుకోవటం లేదన్నారు . అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి , గోకుల్ నగర్ సుల్తాన్ , కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ రాజు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
