నర్కుడలో రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం లో
నమస్తే భారత్ . రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ మండలం నర్కుడ గవర్నమెంట్ స్కూల్ ముందు ఓ వ్యక్తి నీ రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్ స్పెక్టర్ కె నరేందర్ రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన గంగపాక అర్జున్ (50) కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుండగా మంగళవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో శంషాబాద్ నుండి స్వస్థలమైన నాగిరెడ్డి గూడ గ్రామానికి వెళుతుండగ నర్కుడ గవర్నమెంట్ స్కూల్ ముందు వేగంగా దూసుకు వచ్చిన రెడీమిక్స్ లారీ అర్జున్ బైకుకు ఢీకొనడంతో అర్జున్ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావమై మరణించాడు విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
