వృత్తి శిక్షణాధ్యాపకులకు గౌరవ వేతనం
* అందజేసిన జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జివి.కిరణ్ కుమార్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సింగరేణి సేవా సమితి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో వివిధ సింగరేణి కాలనీల సేవా సెంటర్ లలో నిర్వహించిన వృత్తి విద్యాకోర్స్ ల శిక్షణాధ్యాపకులకు బుధవారం సింగరేణి ప్రధానకార్యాలయంలో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జివి.కిరణ్ కుమార్ తన ఆఫీస్ ఛాంబర్ లో గౌరవ వేతన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జివి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సామాజిక భాధ్యతగా సింగరేణి గృహీణులకు పరిసరప్రాంత మహిళలకు ఎన్నో వృత్తి విద్యాకోర్స్ లు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదనీ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్ధికంగా ఎదగాలని కోరారు. కార్పొరేట్ ఏరియా పరిధిలోని సుజాతనగర్, హనుమాన్ బస్తి, సింగరేణి హై స్కూల్, హనుమాన్ బస్తి, ఎండి క్వార్టర్స్ లోని మహిళలకు మగ్గం, టైలరింగ్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చిన పి.సుజాత, ఏ.ఇందిర, టి.పద్మావతి, ఎస్కే.రహిమున్నీస, బి.సాయి హర్షిణికి జిఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ చెక్కుల రూపంలో పారితోషికం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏజిఎం(పర్సనల్) జి.రాజేంద్ర ప్రసాద్, డిజిఎం(పర్సనల్) ముకుంద సత్యనారాయణ, సీనియర్ పిఓ టి.శ్రీనివాస రావు, వెల్ఫేర్ పిఏ కే.వరప్రసాద రావు, సేవా కొ ఆర్డినేటర్ ఇజాజ్ అహ్మద్ షరీఫ్ శిక్షణాధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
