పదోన్నతిపై బదిలీ అయిన రాజారత్నం కు ఘన సన్మానం
రైతులకు ఎనలేని సేవలు అందించిన రాజారత్నం... వ్యవసాయ శాఖ అధికారులు
నమస్తే భారత్,షాద్ నగర్ మే06:షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు వ్యవసాయ శాఖ ఏడిఏ రాజారత్నం ఎనలేని సేవలందించారని వ్యవసాయ శాఖ అధికారులు కొనియాడారు. నారాయణపేట జిల్లా అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ)లో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గా పదోన్నతి పై వెళుతున్న రాజారత్నంను వ్యవసాయ అధికారులతో పాటు డీలర్లు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ శాఖ ఏడిఏ గా ఆయన రైతులకు అందించిన సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ నర్సింహారావు, మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, వివిధ మండల వ్యవసాయ అధికారులు నిశాంత్ కుమార్, రాజేందర్ రెడ్డి, గోపాల్,సురేష్ రెడ్డి, శోభా వివిధ మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు డీలర్లు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
