దెబ్బకి దెబ్బ తీసిన నా భారత సైనికులకు నా సెల్యూట్…
బీజేపీ షాద్ నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ అందే బాబయ్య…
నమస్తే భారత్,షాద్ నగర్ మే06:రాత్రి భారత ఆర్మీ అమలు చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడం భారత ప్రజలందరికీ గర్వకారణం అయింది. దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న మన భారత ఆర్మీ జవాన్లకు బీజేపీ షాద్నగర్ అసెంబ్లి ఇంచార్జ్ అందే బాబయ్య హృదయ పూర్వక అభినందనలు మరియు ఘన సెల్యూట్ తెలియజేశారు.మన దేశ ఆర్మీ తలుచుకుంటే చాలు… పాకిస్తాన్ను చీమల మాదిరిగా నలిపేయగలదు.ఈ ఆపరేషన్ దేశ శత్రువులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది –భారతం మౌనంగా ఉంది అంటే బలహీనత కాదు… సహనం!ఆ సీమ దాటి వచ్చిన ప్రతిసారీ దెబ్బకి దెబ్బ తగలటం ఖాయం!పహల్గాం లాంటి ఘటనలు మళ్లీ తలెత్తే పరిస్థితి వస్తే, ఈసారి భారత్ ఊరుకోదు.మోదీ లాంటి ధీర నాయకుడు ఉన్న దేశాన్ని పరీక్షించే ధైర్యం ఎవరికీ ఉండకూడదు.పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలకు ఇదే గట్టి హెచ్చరిక:భారత్ కన్నెత్తి చూసిన ప్రతి శత్రువు… మట్టిలో కలవాల్సిందే!ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు నిలుస్తున్న ఈ తరుణంలో మన దేశ భద్రత, సమగ్రతపై ఎవరు యత్నించినా వారి ఆఖరి గాలి భారత్ నుంచే ఊదిపోవడం ఖాయం.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
