ప్రజల సమస్యలపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి….
సీఎం రాజీనామా చేయాలి!-బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
నమస్తే భారత్,షాద్ నగర్ మే06:తెలంగాణ ప్రజల ఆశలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి గారు, “నా వల్ల అయితలేదు” అనే మాటలు చెబుతూ చేతులెత్తేయడం ప్రజల విశ్వాసాన్ని మోసం చేసిన చర్యగా భావించాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై చేతులెత్తేస్తే, ఆయనకు ఆ పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కే లేదు.బీజేపీ స్పష్టమైన డిమాండ్ రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టిన విద్యుత్ సంక్షోభం, రైతులను గందరగోళానికి గురి చేసిన ధాన్యం కొనుగోలు సమస్య, బీసీ ఇతర హక్కులను నిర్వీర్యం చేసిన విధానాలు విఫలం అయ్యారు.ఇవే కాక,ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విఫలం ఎన్నికల హామీల అమలులో అపరిష్కారత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గల్లంతు ఇన్నే విఫలమైన పాలన తర్వాత కూడా పదవిని చేపట్టడం అనైతికం. ప్రజల భవిష్యత్తును బలికెత్తే ముఖ్యమంత్రిని తెలంగాణ భరించదు. కాబట్టి బీజేపీ స్పష్టం చేస్తోంది:రెవంత్ రెడ్డి నిబద్ధతతో తన పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రజల ముందు తాను అపరాధిగా నిలబడ్డ విషయం ఆయన స్వయంగా అంగీకరించినట్టే ఇది.బీజేపీ ప్రజలతో ఉంది అవినీతి, అలసత్వంపై పోరాటం కొనసాగుతుంది.అవసరం అయితే బీజేపీ అధికారం చేతపట్టి సుపరిపాలన అందిస్తుంది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
