గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
తేదీ, మే 08, 2025-
నమస్తే భరత్
నిర్మల్:-// జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడమేకాక, రుణాల రికవరీలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది.ఈ కృషికి గాను హైదరాబాద్లోని మహాత్మ జ్యోతిబా పూలె ప్రజా భవన్ లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ అవార్డును ప్రదానం చేశారు.అవార్డును జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, డిపిఎం జ్ఞాను, ఏపీఎం సుదర్శన్లు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు రావడానికి ప్రోత్సాహం కల్పించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
