భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు 

 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ 

భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు 

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. 

తేదీ, మే 07, 2025-
నమస్తే భరత్

నిర్మల్:- జిల్లా
కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్  మాట్లాడుతూ, కుంటాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ రికార్డులలో పేరు, విస్తీర్ణం లోపాలు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో భూములు, సాదాబైనామాలు, హద్దుల తగాదాలు తదితర సమస్యల పరిష్కారానికి ఈ సదస్సులు ఉపయోగపడుతున్నాయని వివరించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని, ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి దరఖాస్తుకూ రశీదు ఇవ్వాలని, సత్వర విచారణ అనంతరం తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్‌ల నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.  అనంతరం సమీపంలోని జొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, రెవెన్యూ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు