బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు : బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమానుల తిరుపతిరెడ్డి అన్నారు.పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పైండ్ల సోమయ్య, పైండ్ల మహేందర్ ల పైండ్ల కేశమల్లు అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం బాధిత కుటుంబాన్ని సందర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిల సహకారంతో బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉండిఆదుకుంటామన్నారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బాధిత కుటుంబాలకు సకాలంలో అందించే విధంగా కృషి చేస్తామన్నారు.ప్రమర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు పెదగాని సోమయ్య, అనుమాండ్ల నరేందర్ రెడ్డి,చెవిటి సధాకర్,కొమురయ్య,బిజ్జాల వరప్రసాద్, నాగిరెడ్డి,రవీందర్ రెడ్డి,మహేందర్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, వెంకన్న యాదవ్,వాసు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, ప్రవీణ్.రెడ్డి,దర్గయ్య,యాకన్న, చిట్టి మల్ల మహేష్, బుచ్చిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధర్మారపు నాగయ్య,రామ్ రెడ్డి, సుధాకర్,వెంకన్న, నరసింహ యాకుబ్ రెడ్డి,ఎద్దు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
