ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ రిపేర్ చేపించాలి
* సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కీ బాలరాజు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎక్స్రే మిషిన్ రిపేర్ చేయించాలని సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ కి ఒక రోగిని వైద్య నిమిత్తం తీసుకెళ్తే డాక్టర్లు చూసి ఎక్స్రేరే తీయాలని చెబుతూ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదని తెలియజేశారని అన్నారు. పేదలు డబ్బులు వెచ్చించి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ హాస్పిటల్ కి వస్తున్నారని అలాంటి వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పని చేయకపోయినా అధికారులు పట్టించుకోవడంలేదని తక్షణమే ఎక్స్రే మిషన్ రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ నర్సింగ్ పోస్టులు భర్తీ చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సరైన సౌకర్యాలు కల్పించకపోతే హాస్పిటల్ కి వస్తున్న ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

