యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు

On
యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు

హైదరాబాద్ : వనబోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనుషుల మధ్య స్నేహభావం పెంపొందిస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కూకట్ పల్లి మలేషియా టౌన్ వేణు గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా వేణు గోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక సమారాధనలు దోహదపడతాయని అన్నారు. కార్తీక మాస వనసమారాధనలతో కుల సంఘాల మధ్య ఐక్యత పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251116-WA0073

Publisher

Namasthe Bharat

Share On Social Media

Related Posts

Latest News

యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో వనబోజనాలు
హైదరాబాద్ : వనబోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనుషుల మధ్య స్నేహభావం పెంపొందిస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కూకట్ పల్లి...
Nizampet Residents Protest, Seek Removal of Commissioner Sabir Ali for Mismanagement
జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం  తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ 

Advertise