రైతుల సేవలో టిడిపి ప్రభుత్వం

On
రైతుల సేవలో టిడిపి ప్రభుత్వం

 

- రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్
 
వెల్దుర్తి (నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:- వెల్దుర్తి రైతుసేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేలా ప్రభుత్వం  అనేక పథకాలను  ప్రవేశపెట్టిందన్నారు. రైతుల ఖాతాలో  అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.6310 కోట్లు జమ చేసిందన్నారు. 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులకు రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. పత్తికొండ నియోజకవర్గం లో అన్ని మండలాల చెరువులకు నీటిని అందించమన్నారు. ఈ ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కే.ఈ.కృష్ణమూర్తి గారికి దక్కుతుందన్నారు. అంతకుముందు 
 సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలను  గారు  పరిశీలించారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ గౌడ్, సుబ్బరాయుడు, సింగిల్ విండో చైర్మన్ రమాకాంత్ రెడ్డి, ఆయా శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise