రాజకీయ లబ్ధి కోసమే లడ్డూల అంశంపై చంద్రబాబు ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి
On
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంపై తరుచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారని.. సిట్ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ప్రసాదం టెస్ట్ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉంటే కల్తీ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
