జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం

On

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం  చేశారు.

WhatsApp Image 2025-03-17 at 8.55.39 AM

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు దోర అరుణ్, శ్యామ్, అశ్రఫ్, కరీమ్, వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. యువజన నాయకులు జగదీశ్వర్ రెడ్డి  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. యువత ఇటువంటి అవమానకర వ్యాఖ్యలకు ఎదురొడ్డి, ఒక్కటిగా ఏకమై, ఇటువంటి అవమానకర వ్యాఖ్యలను తిప్పికొట్టాలని పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

alt

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise