ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలి..

On
ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలి..

పరకాల: ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే 57ఉప కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు కోల్పోతారని చెప్పారు.అణగారిన వర్గాలకు కూడా వర్గీకరణ ఫలాలు దక్కాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏబీసీడీలుగా వర్గీకరించి ఆమోదింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు హనుమకొండ విజయ్, కొయ్యడ అఖిల్, తిక్క రాజు, నాగెల్లి రఘు, కొయ్యడ జశ్వంత్, కొయ్యడ కొమరయ్య, కొయ్యడ రాజేష్, శ్రీపతి శివాజీ, తిక్క యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు. 

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise