నవ లిమిటెడ్ సామాజిక సేవలు హర్షనీయం

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

నవ లిమిటెడ్ సామాజిక సేవలు హర్షనీయం

* పాల్వంచ నవ లిమిటెడ్ సహాకారంతో సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభోత్సవం 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:  పాల్వంచ నవ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా పాలకొయ్య తండా నందు ఏర్పాటు చేసిన 27వ సురక్షిత మంచినీటి కేంద్రాన్ని సోమవారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. మంచినీటి సౌకర్యం కొరకు పాలకొయ్య తండా గ్రామస్థులు తీర్మానం చేసుకొని నవ లిమిటెడ్ యాజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. వెంటనే నవ లిమిటెడ్ యాజమాన్యం సురక్షిత మంచినీటి కేంద్రానికి  నిర్మాణం చేపట్టి పాలకొయ్య పంచాయతీకి అప్పగించడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. మంచినీటి కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు  మాట్లాడుతూ కలుషిత మంచినీటి వలన వచ్చే రోగాలను ఆదిగమించడానికి ఈ సురక్షిత మంచినీటి కేంద్రం ఉపయోగపడుతుందని ప్రజలు అందరూ ఈ సదవకాశాన్ని  ఉపయోగిచుకోవాలని కోరారు. అలాగే నవ లిమిటెడ్ చేస్తున్న వివిధ సంఘ సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సి.యస్. ఆర్. ఎం. జి.ఎం. ప్రసాద్  చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.ఖాదరేంద్ర బాబు, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ వివేక్, డిజిఎం గిరిధర్, ఎన్ శ్రీనివాస్ సివిల్ ఇంజనీర్, సి హెచ్ శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ప్రభుత్వ అధికారులు, సి.యస్. ఆర్ సిబ్బంది గ్రామస్థులు  పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు