వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి
On
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 22) : మంగళవారం మద్దూరు మండలంలోని దోరేపల్లి, పల్లెగడ్డ తాండ మరియు మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని విక్రయించటానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందు ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అలాగే కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యం తడవకుండా సంబంధిత అధికారులు రైతులకు కవర్లు అందించాలన్నారు. వీరి వెంట మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రావణ్ కుమార్, శ్వేత తదితరులు ఉన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 22:06:37
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...