జీవో 9 ఉండగానే జీవో 46..

On


హైదరాబాద్‌, నవంబర్‌ 27( ) : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్‌ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీవోపై విచారణ డిసెంబర్‌ 12న కొనసాగాల్సి ఉన్నది. అంతలోనే హడావుడిగా మొత్తం రిజర్వేషన్లను మళ్లీ 50శాతంలోపు కుదిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 46ని విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. కోర్టు తేల్చకముందే కొత్తగా జీవోను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? కోర్టు కొట్టేస్తుందని భావిస్తే ముందే ఎందుకు జీవో 9ని జారీ చేసింది? కేవలం బీసీలను వంచించేందుకేనని బీసీ సంఘాలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నా రు. కోర్టుపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తుండడంపై నిప్పులు చెరుగుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ పూర్తిగా మౌనం వహించడం, పార్లమెంట్‌లోనూ ప్రశ్నించకపోవడం ఆ పార్టీ వంచనకు నిదర్శనమని చెప్తున్నారు. అడుగడుగునా కాంగ్రెస్‌ సర్కారు బీసీలకు తీరని ద్రోహాన్ని తలపెట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise