ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ ఓఎస్డీ స్టేట్మెంట్ రికార్డ్
On
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారించింది. రెండు గంటల పాటు విచారణ జరిపిన సిట్ అధికారులు.. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధా కిషన్రావు స్టేట్మెంట్లో అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
