పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

On
పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

బంజారాహిల్స్, మార్చి 19 : ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 హైలం కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర స్వామి కుమార్తె సుమ(17) కర్నూల్‌లోని బీసీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది.ఇటీవల పరీక్షలు పూర్తవడంతో ఆమె హైలం కాలనీలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్న సుమ తాను పరీక్షలు సరిగ్గా రాయలేదంటూ బాధపడుతోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గంటన్నర తర్వాత ఎర్ర స్వామి చెల్లెలు కుమార్తె లేఖ వారి ఇంటికి వచ్చింది. సుమ గది వద్దకు వెళ్లి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న సుమా కనిపించింది. ఆమెను హుటాహుటిన స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు మృతురాలి తండ్రి స్వామి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise