పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

On
పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

బంజారాహిల్స్, మార్చి 19 : ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 హైలం కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర స్వామి కుమార్తె సుమ(17) కర్నూల్‌లోని బీసీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది.ఇటీవల పరీక్షలు పూర్తవడంతో ఆమె హైలం కాలనీలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్న సుమ తాను పరీక్షలు సరిగ్గా రాయలేదంటూ బాధపడుతోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గంటన్నర తర్వాత ఎర్ర స్వామి చెల్లెలు కుమార్తె లేఖ వారి ఇంటికి వచ్చింది. సుమ గది వద్దకు వెళ్లి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న సుమా కనిపించింది. ఆమెను హుటాహుటిన స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు మృతురాలి తండ్రి స్వామి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

About The Author

Tags

Share On Social Media

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise