స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించి..

On
స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించి..

హైదరాబాద్‌ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్‌ విక్రమ్‌-1ను ఆవిష్కరించారు. స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కైరూట్‌ బృందానికి ప్రధాని అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ అంతరిక్షంలో ఇది మైలురాయిగా పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్‌ గొప్ప ప్రతీక అని, భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని.. సైకిల్‌పై రాకెట్‌ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని పిలుపునిచ్చారు. స్పేస్‌ సెక్టార్‌లో కో ఆపరేటివ్‌, ఎకో సిస్టమ్‌ను తీసుకువచ్చామని.. జన్‌జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 

Tags

Share On Social Media

Latest News

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ ఓఎస్డీ స్టేట్‌మెంట్ రికార్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ ఓఎస్డీ స్టేట్‌మెంట్ రికార్డ్
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR)...
2015 గ్రూప్‌-2 ర్యాంకర్స్‌కు ఊరట.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన సీజే ధర్మాసనం
స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించి..
నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్..
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూల అంశంపై చంద్రబాబు ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి
ఆధార్‌ ఉన్నంత మాత్రాన చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించాలా
కేసీఆర్ అమరణ నిరాహారదీక్షనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం వేసింది 

Advertise