పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వరంలా మారాయి   ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,

On
పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వరంలా మారాయి    ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,

 

 నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 13, పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఒక వరంలా మారాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మండల తాసిల్దార్ కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు 631 మంది కి 6 కోట్ల 31 లక్షల 73 వేల 196 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఒక వరంలా మారాయి అన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సిబ్బంది కార్పొరేటర్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు  కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 
    ములుగు జిల్లానమస్తే భారత్ప్రతినిధి ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ! 
క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి
తెలంగాణ పెరిక కుల ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

Advertise