ఆదివాసీలకి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన పవన్ కళ్యాణ్
On
అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తండాలో రెండువందలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి . అభివృద్ధి వెలితిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి గ్రామాలను సందర్శించారు. గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కురిడి గ్రామంలో శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. గ్రామస్తుల రోడ్డు సమస్యలు చూసి తానే స్వయంగా రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులను పిలిచి మౌలిక సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు.
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
