Tag
shad nagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాయికల్ లో ఘనంగా "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్" జయంతి
Published On
By NAMASTHEBHARAT
రాయికల్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాయికల్ గీత కార్మిక సంఘం అధ్యక్షుడు రేవెల్లి సత్తయ్య గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, పాపన్న గౌడ్ పోరాట పటిమను, నాయకత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని వివరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ., "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిజమైన స్వరాజ్య స్థాపకుడు. ఆయన మొఘల్ పాలకుల కఠినమైన పన్ను విధానాలను, అన్యాయాన్ని తట్టుకోలేక ప్రజల కోసం పోరాడాడు. భద్రాద్రి సీమలోని పల్లెల్లో ప్రజలను ఐక్యపరిచి, సైన్యం ఏర్పరచి స్వంత రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన కోటలు నేటికీ ఆయన ధైర్యాన్ని గుర్తు చేస్తాయి. బుర్హాన్పూర్ యుద్ధంలో ఆయన చూపిన వీరత్వం, యుద్ధ వ్యూహాలు అతని సైనిక ప్రతిభకు నిదర్శనం. స్వల్ప బలగాలతోనే శక్తివంతమైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొని గెలిచిన ఆయన ధైర్యం అపూర్వం. పాపన్న గౌడ్ కేవలం యోధుడే కాదు, దూరదృష్టి కలిగిన సామాజిక నాయకుడు. ఆయన పాలనలో కులమత భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధానాలు చేపట్టాడు. నేటి సమాజంలో ఆయన చూపిన సమానత్వం, న్యాయం, స్ఫూర్తి చాలా అవసరం."* అని సత్తయ్య గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ గౌడ పెద్దలు, గౌడ సంఘం సభ్యులు, స్థానిక గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ సమాజ అభివృద్ధికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని తీర్మానించారు. 