నీటి లోతు తెలియకుండా ఈత గురించి అందులోకి దూకి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు

ఈత సరదా విషాదంగా మారకూడదు

 నీటి లోతు తెలియకుండా ఈత గురించి అందులోకి దూకి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు

తల్లిదండ్రులు వెంబడి ఉండి పిల్లలకు ఈత నేర్పించాలి 

వేసవి సెలవులలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్ళుచున్నారు ఒక కన్నేసి ఉంచాలి 

తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి.

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు 

తేదీ:19-ఏప్రిల్-2025 నమస్తే భారత్ : పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   చెరువులు ,కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదుచూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు.ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్నేహితులతో బయటకు జాగ్రత్త వహించాలని సూచించారు, ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు  పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని ఇట్టి విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కమిషనర్ మేడమ్ గారు సూచించారు. కమిషనర్ కార్యాలయము నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది  హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది 
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6)  : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...
త్రాగునీరు సరఫరా,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నర్కుడలో రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి 
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి