డాక్టర్, బాబుసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి - బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి
నమస్తే భరత్,,, 21/4/2025/ : నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాలమేరకు శ్రీ Dr.బి.ఆర్.అంబెడ్కర్ గారి జయంతి ఉత్సవాలలో భాగంగా కోలార్ మాజీ ఎంపీ శ్రీ మునిస్వామి గారు, SC మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శ్రీ కొప్పు భాషా గారు పాల్గొన్న కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ సత్య యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ,భారత రత్న, న్యాయకోవిదుడు, భారతావని ముద్దు బిడ్డ శ్రీ Dr.బి.ఆర్.అంబెడ్కర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ, వారి ఆశయాలని కొనసాగించాలని ఈ సందర్భముగా మాట్లాడారు.మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అంబెడ్కర్ గారి ఆశయాలకు ప్రాధాన్య మిస్తూ వారి జీవితానికి సంబందించిన ప్రదేశాలను కోట్లాది రూపాయలను వెచ్చించి 1..జన్మభూమి, 2,అంత్యక్రియలు జరిపిన భూమి,3.ఉన్నత విద్యను అభ్యసించిన ప్రదేశం 4.బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రదేశం 5.అంబెడ్కర్ గారు తుది శ్వాస విడిచిన ప్రదేశాలను పంచ తీర్థాలుగా అభివృద్ధి చేసి,వాటిని చారిత్రక మరియు సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్ది భారతీయ జనతా పార్టీ తన నిబద్ధతని చాటుకుందని కొనియాడారు.అదేవిదంగా SC,ST, మైనారిటీ వర్గాలకు చెందిన శ్రీ రాంనాథ్ కోవింద్ గారు,శ్రీమతి ద్రౌపది ముర్ము గారు,మరియు శ్రీ ఏపీజే అబ్దుల్ కలామ్ గార్లని భారత దేశ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిన ఘనత బీజేపీదేనని బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి మాట్లాడారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

