యతి రాజారావు పార్కులో సమస్యలు పరిష్కరించాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఉన్న యతి రాజారావు పార్కులో సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ కు యతిరాజారావు పార్క్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తొర్రూరు అధ్యక్షులు కత్తి రవీందర్,కార్యదర్శి ఏక్కటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులోనీ జిమ్ము పరికరాల మరమ్మతు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కమిషనర్ స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వింజమూరి సుధాకర్, నాయకులు కిన్నెర యాకయ్య, బొలగాని మహేష్,పెరుమాండ్ల రవి గౌడ్,రాములు, కావటి మంగమ్మ, బోడ బాలాజీ, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, రాయిశెట్టి వెంకన్న, సోమ రాములు, మోడo సోమ నరసయ్య, తాళ్లపల్లి బిక్షపతి, నరెడ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
