5న జరిగే సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట డిసెంబర్ 2 ( నమస్తే భారత్ ) :
ఈ నెల 5న నర్సంపేట పట్టణానికి సుమారు 1,000 కోట్ల రూపాయల పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయుటకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్, భారీ బహిరంగ సభ స్థలాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ అంకిత్ కుమార్ లతో కలిసి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పరిశీలించారు.
ఈకార్యక్రమంలో ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి, ఎస్ బి ఏసీపీ జితేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్ , టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ , డాక్టర్ పులి అనిల్ , నర్సంపేట సోసైటి చైర్మన్ బొబ్బల రమణారెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలీ, గంధం నరేష్ , నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ , జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు రూపిక శ్రావణ్ కుమార్, మాజీ సోసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్ , మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్ , పబ్బతి సతీష్ రెడ్డి, పోతారబోయిన చంద్రమౌళి, బాణాల శ్రీనివాస్ , మేరుగు కిరణ్ , గద్ద అఖిల్ , తదితరులు పాల్గొన్నారు.
