మరికల్ మండలంలోనీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన:సీఐ రాజేందర్ రెడ్డి
On
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు,గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి,ఎస్ ఐ రాము లు కలిసి మరికల్ మండల పరిధిలోని మరికల్, పెద్దచింతకుంట, అప్పంపల్లి, తీలేరు గ్రామలలోనీ వివిధ పోలింగ్ కేంద్రాలను శుక్రవారం రోజు పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రాధమిక సౌకర్యాలు,తాగునీరు, విద్యుత్, బ్యారికేడ్లు,మరుగుదొడ్లు, శానిటేషన్ వంటి ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.అదే విధంగా,పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవకుండా పోలీసు భద్రతా చర్యలు,చుట్టుపక్కల నిఘా, క్రమశిక్షణపై ప్రత్యేక సూచనలు చేశారు.ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ,ప్రజలు భయపడకుండా, స్వేచ్ఛగా తమ ఓటును హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది అని సీఐ తెలిపారు
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
