ఏసీబీ వలలో పెద్దవంగర మండల తహసీల్దార్
On
పెద్దవంగర కార్యాలయంలో అధికారుల సోదాలు
నమస్తే భారత్:- పెద్దవంగర
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరగంటి మహేందర్ ఏసీబీ ఉచ్చులో పడ్డారు. పూర్వీకుల వ్యవసాయ భూమి వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడా నికి అర్జీదారుడి నుంచి రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర యించాడు. అధికారులు పక్కా ప్లాన్తో ఇవాళ తహసీల్దార్ ప్రైవేట్ కారు డ్రైవర్ తుప్పాని.గౌతమ్కు బాధితుడు రూ.15వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తహసీల్దార్ తీసుకొమ్మన్నారని చెప్పాడు. దీంతో అధికారులు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. తహసీల్దార్, అతడి డ్రైవర్ను అదు పులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడులు వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారుల నేతృత్వంలో కొనసాగుతున్నాయి..
Tags
Related Posts
Latest News
30 Nov 2025 22:43:29
Hyderabad: A shocking incident of child abuse came to light in Shapur Nagar under Jeedimetla Police Station limits, where a...
