Tag
BRS Baki Card
రంగారెడ్డి 

ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ

 ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ 4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు కూలీలకు 12,000, రైతు భరోసా నిధులు, కల్యాణ లక్ష్మి తులం బంగారం, సిలిండర్లకు 500 సబ్సిడీ వంటి పథకాలు అమలుకోవడం లేదని అంజయ్య యాదవ్ ముందు గోడు వెళ్ళబోసుకున్న బాదిత ప్రజలు కేసీఆర్ అన్ని పథకాలను అందిస్తే రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బహిరంగంగా హెచ్చరించిన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీ పడిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్ నగర్ లో స్వయంగా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అనంతరం మాట్లాడారు. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయిందని విమర్శించారు. ఉచిత బస్సు మినహా ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని, పేద ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని  చెప్పారు. సాధారణ కుటుంబానికి సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వేల రూపాయలు బాకీ పడిందని, కాంగ్రెస్ చేతిలో మోసపోయామని పేద ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే 4000 పింఛన్లు, రాయితీ సిలిండర్లు, గృహా జ్యోతి విద్యుత్తు, రైతు కూలీలకు 12,000, మహిళలకు 2500, విద్యార్థులు విద్యార్థినీలకు స్కూటీలు, రైతు భరోసా నిధులు, రైతు రుణమాఫీ, బతుకమ్మ చీరల పంపిణీ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని ప్రజలు బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు.
Read More...

Advertisement