గోర్ మాటి సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎంపీపీ అరుణ రాంబాబు నాయక్
నమస్తే భారత్ :-మరిపెడ : 26/04/2025 న మాకుల బావ సింగ్ మహారాజ్ మరియు మ్యారామా యాడీ క్షేత్రంలో జరిగే బండ్లు తిరుగు కార్యక్రమం సందర్భంగా లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోర్ మాటి సదస్సును ఏర్పాటు చేశామని లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ తెలుపుతూ అట్టి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ ఎంపీపీ అరుణ రాంబాబు నాయక్ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగినది బావ సంగ్ మహారాజ్ బండ్లు తిరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేసి ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గోర్ మాటి సదస్సును విజయవంతం చేయాలని గుగులోత్ రాంబాబు నాయక్ కోరారు అలాగే జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త మాట్లాడుతూ గోర్ మాటి సదస్సులో భాగంగా ఏడుగురు మాతల యొక్క చిత్రపటాలకు పూలదండలేసి నివాళులు అర్పించడం అలాగే వారికి భోగ్ బండారు సమర్పించడం అలాగే జాతి గురువులు అయిన ఆరుగురు గురువులకు అలాగే కలియుగ దేవుడు బాలాజీ మహారాజ్ కి అలాగే వారి ఇష్ట భక్తులు అయిన హాతీ రామ్ మహ రాజుకు అలాగే బుడియా బాబు మహారాజుకు అలాగే లింగ మసంద్ మహారాజుకు అలాగే లోక మసంద్ మహారాజుకు భోగ్ బండారు కార్యక్రమం జాతి మహారాజులు సాధువులు సంతులు బావాలు భగత్ ల చేతుల మీదుగా ఘనముగా భోగ్ బండారు కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు అలాగే రాష్ట్రంలో ఉన్న మేధావులు ఉద్యోగులు నాయకులు జాతి తరపున జరిగే మేధో మదన సదస్సులో పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుగులోత్ రాంబాబు నాయక్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే మాకుల భవసంగ్ మహరాజ్ మ్యారామ యాడీ క్షేత్ర పూజారి సీతారాం నాయక్ అలాగే లంబాడీల ఐక్య వేదిక జిల్లా మీడియా సెక్రెటరీ మూడవత్ రవి నాయక్ అలాగే లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ నాయక్ అలాగే మాకుల తండా పూజారి అర్జున నాయక్ తండా నాయకులు తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

