ఉపాధి హామీ కి నిధులు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య
ఇందిరమ్మ ఇండ్ల పథకం లో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ హామీ ప్రకారం ఆరు లక్షలు ఇవ్వాలి పాలమాకుల జంగయ్య
వ్యవసాయ కార్మికుల సమస్యలు ప్రభుత్వాలకు ఎందుకు పట్టవు సమాధానం చెప్పాలి. పుస్తకాల నర్సింగరావు
నమస్తే భారత్ షాద్ నగర్ జులై05:షాద్ ననగర్ లో పెన్షనర్స్ భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా 9వ మహాసభ జిల్లా అధ్యక్షులు జే అంజయ్య అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాదిహమి రోజురోజుకు నిర్వీర్యపరుస్తుందని మండిపడ్డారు 2005లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం పేదలకు వ్యవసాయ కార్మికులకు జీవనోపాధిగా బ్రహ్మాండంగా కొనసాగిందని అన్నారు అలాంటి పేదల సంబంధించిన పథకం సరైన నిధులు కేటాయించక పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసివేయడం వెనక ఉన్న ఉద్దేశం పథకాన్ని నిర్వీర్యపరిచి ఎత్తేయాలను వియోచన చేస్తుందని ఆరోపించారు ఉపాధి హామీ పథకం జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటే అని ఆయన హెచ్చరించారు
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలు ముఖ్యమైనవని వాటిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా కీలకమైందని అన్నారు అలాంటి పథకాన్ని ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు లక్షలు ప్రోస్డింగ్ లు దళిత గిరిజనుల లబ్ధిదారుల చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటుంది అని మండిపడ్డారు చిత్తశుద్ధి లేని హామీలు ఇస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు పరిశ్రమడంలో పునర్ ఆలోచన చేయాలని ఆయన సూచించారు వెంటనే దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజన లబ్ధిదారులను సమీకరించి పెద్ద ఎత్తున సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు
సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అని మండిపడ్డారు ఉచిత బియ్యం ఇచ్చి ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికార దాహంతో జల్సాలు చేస్తున్నారు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు పేదలు పేదలుగానే ఉన్నారని పేదల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదని పేదలు పోరాటాల శరణమని వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ మహాసభను ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి మాట్లాడారు ఈ మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని ఈ మూడు సంవత్సరాల కాలంలో చనిపోయిన నాయకులకు అందరికీ సంతాప సూచకంగా రెండు నిమిషాలు మహాసభ మౌనం పాటించింది అనంతరం మూడు సంవత్సరాల కు సంబంధించిన కార్యక్రమాల రిపోర్టు ను జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య ప్రవేశపెట్టారు అనంతరం జిల్లా వ్యాప్తంగా వచ్చిన మండల నాయకత్వం చర్చల్లో పాల్గొని చర్చించారు అని బుద్ధుల జంగయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ లక్ష్మయ్య రమేష్ యాదవ్ జిల్లెల్ల వెంకటేష్ స్వరూప యశోద రాజు నాయక్ రాములు జి జంగయ్య బాలకృష్ణయ్య సిబి చంద్రయ్య సుధీర్ దామోదర్ రెడ్డి లింగం తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
