మహా నాయకుడు మాజీ సీఎం రోశయ్యకు ఘనంగా జయంతి ఉత్సవాలు

మహా నాయకుడు మాజీ సీఎం రోశయ్యకు ఘనంగా జయంతి ఉత్సవాలు

 

ఐటీడీఏ పీవో బి రాహుల్ 


నమస్తే భారత్' భద్రాచలం


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కర్షక నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసి తెలుగుజాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి కీర్తిశేషులైన కొణిజేటి రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ కూర్పులో ఘనపాటిగా పేరుందిన మహా నాయకుడు కొణిజేటి రోశయ్య అని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. 
      శుక్రవారం నాడు ఐటిడిఏ కార్యాలయపు సమావేశ మందిరంలో మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య 92 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య 1933వ సంవత్సరం జూలై 4 న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారని, గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ మరియు వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారని, ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1968 నుండి 1980 సంవత్సరం వరకు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రి వర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్ గా తన సేవలు అందించారని, అటువంటి మహానియుడుని స్మరించుకుంటూ మనమందరం పట్టుదలగా పనిచేసి మన ఉద్యోగ ధర్మాన్ని గిరిజన ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఉన్నారు.
       ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ,ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఎస్ ఓ భాస్కరరావు, ఎఫ్ డి సి ఉదయ్ కుమార్, ఏ సి ఎం ఓ రమేష్, ఏపీ ఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, డీఎస్ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ, జి సి డి ఓ అలివేలు మంగతాయారు ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉపాధి హామీ కి నిధులు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య  ఉపాధి హామీ కి నిధులు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య 
ఇందిరమ్మ ఇండ్ల పథకం లో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ హామీ ప్రకారం ఆరు లక్షలు ఇవ్వాలి పాలమాకుల జంగయ్య  వ్యవసాయ కార్మికుల సమస్యలు ప్రభుత్వాలకు ఎందుకు పట్టవు...
ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
మొహరం పండుగ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: డీఎస్పీ నల్లపు లింగయ్య
సమ సమాజ నిర్మాణమే ఎర్రజెండా లక్ష్యం
సాయిబాబా కాలనీలో సీసీ రోడ్ల భూమిపూజ
మెదక్ ఎంపీ రఘునందన్ రావుని పరామర్శించిన అందే బాబయ్య…
మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి