మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి 

మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి 

 

------ స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్.

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని  పగడ్బందీగా అమలు చేయాలని, మాదకద్ర వ్యాల వల్ల కలిగే అనర్ధాలపై జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం  సాయంత్రం  జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో  మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు... జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని  జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీల ద్వారా   మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఉన్నత పాఠశాలలోనూ  అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. డి.ఎస్.పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీవలే నషా ముక్త్ భారత్ లో భాగంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి అదనపు కలెక్టర్  కు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధం పై  విద్యార్థులకు  అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గతంతో పోలిస్తే  డ్రగ్స్ కేసులు చాలా తక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. టాస్స్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ పై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడం జరిగిందని డిఎస్పీ వివరించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆబ్కారీ శాఖ, విద్యాశాఖ, ఆర్టీవో, ఆర్టీసీ, అటవీ శాఖ అధికారులు కూడా మాదకద్రవ్యాల నిషేధంపై   కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి నేతత్వంలోనూ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇటీవల కళాశాలలో కొత్తగా విద్యార్థులు చేరారని, ఈ  రెండు, మూడు రోజులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి సుదర్శన్ తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారులు సైతం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల నెలవారి సమావేశాలలో డ్రగ్స్ నిషేధం గురించి తెలిపి క్షేత్రస్థాయిలో వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా  తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన డీపీఓ బిక్షపతి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాఖల వారీగా అధికారులు డ్రగ్స్ నిషేధం పై ఒక టార్గెట్ ను నిర్దేశించుకుని పని చేయాలని ఆయన సూచించారు. వచ్చే సమావేశానికి ఆర్టీసీ డి ఎం కూడా హాజరు అయ్యేటట్టు చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మేఘా గాంధీ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సి సెక్షన్ అధికారినిలు పాల్గొన్నారు. అనంతరం వీసీ హాల్ లో డీ ఎల్ ఎస్ ఏ సమావేశం నిర్వహించగా అదనపు కలెక్టర్ కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో తహసీల్దార్లు పాటించాల్సిన నిబంధనల గురించి తెలిపారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఫలాంబరిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వన దుర్గామాత ఫలాంబరిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వన దుర్గామాత
పన్నపేట, జులై 6 : ఆషాడమాసం రెండవ ఆదివారం పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని...
హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
ఉపాధి హామీ కి నిధులు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య 
ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్