హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు

హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు

 హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల  కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. చాలాచోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.రాష్ట్రవ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్కరోజులో 115-204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అంటే అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా, సిర్మూర్‌, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్‌ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని ఐఎండీ హెచ్చరించింది. బిలాస్‌పుర్‌, హమీర్‌పూర్‌, చంబా, సిమ్లా, కులూ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

దీనికితోడు బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సాయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వానికి సూచించారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఫలాంబరిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వన దుర్గామాత ఫలాంబరిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వన దుర్గామాత
పన్నపేట, జులై 6 : ఆషాడమాసం రెండవ ఆదివారం పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని...
హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాలు.. 75కు పెరిగిన మరణాలు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
ఉపాధి హామీ కి నిధులు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య 
ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్