ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట్ జిల్లా/ నమస్తే భారత్
నారాయణపేట జిల్లా కు 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయిల్ ఫామ్ సాగు కోసం నిర్దేశించిన 3500 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమన్వయంతో రైతులను గుర్తించి లక్ష్యసాధనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయిల్ ఫామ్ సాగు పై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు నిర్దేశించిన 3500 ఎకరాల కు ఇప్పటి వరకు 54 ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలను నాటడం జరిగిందని తెలిపారు. ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులను గుర్తించడంతోపాటు వారికి ఆయిల్ ఫామ్ తోటల సాగుతో వచ్చే లాభాల గురించి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఒక్కో మండల వ్యవసాయ అధికారికి 50 ఎకరాల టార్గెట్ ను కలెక్టర్ నిర్దేశించారు. ఉద్యాన శాఖ పథకం అనుసంధానంతో మొక్కల సరఫరా, మొదటి 4 సంవత్సరాల అంతర పంటలకు, రసాయన ఎరువులకు సబ్సిడీ ఉంటుందని ఆమె చెప్పారు. వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వారానికి మూడు రోజుల చొప్పున రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి మొక్కలు, డ్రిప్ కొరకు రైతు వాటా డీ డీ కట్టించి జిల్లాకు కేటాయించిన ఆయిల్ ఫామ్ తోటల సాగు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు రామలక్ష్మి,
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ నుండి ప్రత్యేక అధికారి సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన మరియు పట్టు పురుగుల పెంపకం అధికారి సాయి బాబా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్,వ్యవసాయ శాఖ డీ డీ రాజరత్నం,అన్ని మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు, విస్తరణ అధికారులు, ఆయిల్ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

