ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదే యోగ
మనసు శరీరం ఆత్మను ఏకం చేసే ఒక ప్రాచీన పద్ధతే యోగ
యోగా గురు మోటివేషన్ స్పీకర్ మహేందర్ గురు
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జూన్ 21. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని యోగ గురువు మోటివేషన్ స్పీకర్ మహేందర్ గురు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గణేష్ నగర్ ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యోగా గురువు మోటివేషన్ స్పీకర్ మహేందర్ గురు సహకారంతో వివిధ యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదని అదే మనసు, శరీరం, ఆత్మను ఏకం చేసే ఒక ప్రాచీన పద్ధతి అని తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంపూర్ణ ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ఒక వేదికగా నిలుస్తుంది అని తెలిపారు. యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తాయని మహేందర్ గురు వివరించారు. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా ఎంతగానో సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దయనందిన జీవితంలో యోగా ఎంత ముఖ్యమైనదో తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాఠశాలలను నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల్లో శారీరక మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం చాలా అవసరమని యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది క్రమశిక్షణ ఏకాగ్రత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఒక శక్తివంతమైన సాధనం అన్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తామని యోగా గురు మహేందర్ గురుకు 40 వారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నవయుగ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏరువ కుమారస్వామి, ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంపల్లి జగదీష్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ లో యోగా వేడుకలు
పురపాలక పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్లే గ్రౌండ్లో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గణేష్ గుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా మినీ స్టేడియంలో యోగాసనాలు నిర్వహించడం జరిగిందన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరూ యోగ సాధన ప్రతినిత్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ డి వెంకటేష్ గౌడ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఇతర సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దైనందిన జీవితంలో యోగ ఎంతో ముఖ్యమైనది
పురపాలక మాజీ వైస్ చైర్పర్సన్ సుష్మ మహేందర్ రెడ్డి.
మానవుని దైనందిన జీవితంలో యోగ ఎంతో ముఖ్యమైనదని సుష్మ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా వేడుకలను పురస్కరించుకొని యునాని వైద్యురాలు జయశ్రీ ఆధ్వర్యంలో మహిళా మండలి హాల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా సుష్మ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దైనందిన జీవితంలో యోగ ముఖ్య సాధనంగా మారాలని అన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత తో పాటు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని వారన్నారు. యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాదని క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఒక శక్తివంతమైన సాధనమని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

