ప్రజా పాలనలో అభివృద్ధి బాటలో మెదక్ జిల్లా
క్షేత్రస్థాయి పర్యటనలో అరుదైన ఘనత సాధించిన జిల్లాకలెక్టర్
మెదక్ జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక కథనం
మెదక్,జూన్29(నమస్తే భారత్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం గడిచిన ఏడాది కాలంలోగత పార్లమెంట్ ఎలక్షన్స్ మోడల్ కోడ్
ముగిసిన అనంతరం 01 జూలై 2024
నుండి 29-06-2025 వరకు ఒక సంవత్సరకాలం సుమారుగా 255 రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలలో నిమగ్నమై ఉన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఈసంవత్సర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 280 రోజులు ఉంటే సుమారుగా 90% రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి విప్లవాత్మ కమైన మార్పులు శ్రీకారం చుట్టడం విశేషం.
పేద ప్రజలకు విద్య,వైద్యం, సంక్షేమ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా. పకడ్బందిగా సమర్థవంతమైన పాలనను మెదక్ జిల్లా ప్రజలకు అందిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే , విద్యా ,వైద్యం,వ్యవసాయం, విద్యుత్, మహిళా సాధికారత తదితర రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేందుకు కృషి చేశారు.
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ వ్యవసాయరంగం పై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పంట పొలాలలో రైతులను నేరుగా కలిసి వ్యవసాయ స్థితిగతులను తెలుసుకొని రైతులు ఒకే పంటపై ఆధారపడకూడదని అంతర్ పంటల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ .రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కలెక్టర్ వివిధ మార్గాలను అన్వేషించి తద్వారా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్లాన్ చేసి అమలు చేయడానికి రైతులతో సంభాషించడం,వారి నుండి ప్రత్యక్ష అభిప్రాయాన్ని తీసుకోవడం మంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులను నిర్ధారించడం, 2024-25 రబీలో రికార్డు స్థాయిలో 3.2 మెట్రిక్ టన్నుల వరి సేకరణ,గత 4 సంవత్సరాలలో ఇదే అత్యధికంగా ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి కలెక్టర్ స్వయంగా రాత్రి బస ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తానే స్వయంగా ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారానికి కావలసిన ప్రణాళికలను రూపొందించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు.విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రవేశపెట్టి విద్యా నైపుణ్యాలు పెంచే దిశగా కృషి చేశారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో 562 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి
గణితం,విజ్ఞాన శాస్త్రంలో సాధించడంలో భాగంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని జిల్లాలో అమలు చేయడం జరిగింది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఫలితంగా
పదవ తరగతిలో 97 %ఉత్తమ ఫలితాలు సాధ్యపడ్డాయి.
జిల్లాలో ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు*
ప్రభుత్వ సలహాలు సూచనలు పాటిస్తూ వైద్య ఆరోగ్య శాఖను మరింత పట్టిష్టం చేస్తూ ప్రజలకు సమగ్ర వైద్యం అందించేందుకు జిల్లా కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ,సీసీటీవీ కెమెరాలు ద్వారా ఆసుపత్రి సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల వైద్య సిబ్బంది తమ విధులను క్రమశిక్షణగా నిర్వహిస్తూ సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో ఉన్న వసతులపై సమీక్షలు చేపడుతున్నారు.వైద్య సేవల నాణ్యత మెరుగుపరచే దిశగా అవసరమైన ఆధునిక వైద్య పరికరాల సమకూర్పుపై దృష్టి సారించారు.
ప్రతి ఒక్క రోగికి సరైన సేవలు అందేలా వైద్య సిబ్బందికి మార్గనిర్దేశం చేసి, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు.
అన్ని పిహెచ్సిలు, సిహెచ్సిలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో సిసిటివిలను ఏర్పాటు చేయడం మరియు కలెక్టర్ ఛాంబర్,డిఎంహెచ్ఓ ఛాంబర్ నుండి వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది హాజరు,సమయాలను పర్యవేక్షించడం,అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో హాజరు, వైద్యుల సమయాలు,ఆరోగ్య సేవలను మెరుగుపరచడం. పటిష్ట చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు కలెక్టర్ చూపుతున్న చొరవ మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు దోహదపడుతోంది.
మహాలక్ష్మి పథకం అమలు తీరును స్వయంగా కలెక్టర్ దంపతులు టికెట్ కొనుగోలు చేసి బస్సులో సాధారణ ప్రయాణికుల్లాగా ప్రయాణం చేయడం
విశేషం.
లెస్ పేపర్ - లెస్ ప్లాస్టిక్
-పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించాలనే దృడ నిశ్చయంతో అధికారులకు, సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తూ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు,ఇతర శాఖలలో కూడా ప్లాస్టిక్ నిర్మూలించి స్టీల్ బాటిల్స్, పేపర్ గ్లాసులు ద్వారా సమావేశాలలో త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు.ఈఆఫీస్ విధానాన్ని అమలు చేసి ప్రతి ఫైలు ఈ ఆఫీసులో రావాలి యాన్యువల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆ దిశగా ప్రతి శాఖ ఫైల్స్ ఆన్లైన్ ద్వారా
పరిష్కరిస్తూ చర్యలు తీసుకున్నారు.
తద్వారా ఇప్పటివరకు 1700 ఫైల్స్ ఆన్లైన్ ద్వారా పరిష్కరించడం జరిగింది.
ఆదివారాలు,సెలవు రోజుల్లో కూడా క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్
సహజంగా ఆదివారాల్లో కలెక్టర్ గాని
ఏప్రభుత్వ ఉద్యోగి కూడా సమయాన్ని
కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు.దీనికి భిన్నంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారాల్లో కూడా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత చేరువ చేయాలనే ఉద్దేశంతో విస్తృత పర్యటన నిర్వహించి, ప్రజల్లో మమేకమై జిల్లా ప్రగతి, అభివృద్ధి సంక్షేమంపై నిరంతరం
కృషి చేస్తున్నారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజలలో మమేకమవడం వల్ల పథకాలు అమలు చేయడం వాటి ఫలితాలు ప్రజలకు అందించడంలో జిల్లా యంత్రాంగానికి ప్రత్యక్ష అభిప్రాయం లభించడం జరిగిందన్నారు.
తద్వారా ఆపథకాలనన్ని అర్హులైన లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా అందించడానికి ఉపయోగపడ్డాయని వెల్లడించారు.
అదేవిధంగా జిల్లా అధికారులు అందరూ కూడా సాధ్యమైనంత ఎక్కువ సమయం క్షేత్రస్థాయిలో పర్యటించినట్లయితే ఆయా శాఖల,సిబ్బంది పనితీరు మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా అందరు కృషి చేయాలని ఆదేశించారు.
కేవలం ఆదేశాలిచ్చే స్థాయిలో పరిమితం కాకుండా జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రజల్లో మమేకమై ఇటు ప్రజల మధ్య పనిచేయడం ద్వారా ఒక ఉదాహరణగా నిలిచారు.
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా నిరంతరంగా పని చేస్తూ, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటికి తక్షణమే పరిష్కారం చూపే విధంగా కలెక్టర్ విశేషంగా కృషి చేస్తున్నారు.అత్యవసరాలపై తక్షణ స్పందన,అధికార యంత్రాంగం పట్ల సమన్వయం, ప్రజల బాగుపై ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు.
ప్రభుత్వ పథకాల అమలులో పకడ్బందీ పర్యవేక్షణతో పాటు, ప్రతి శాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ జిల్లా అభివృద్ధిని నడిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజల అభ్యర్థనలపై స్పందిస్తూ వారికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈవిధంగా ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా శ్రమిస్తున్న కలెక్టర్ ప్రజల మన్ననలు పొందుతున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
