గిరిజన నిరుద్యోగులైన ప్రతి యువకులు వ్యాపారంలో నష్టపోకుండా జీవనోపాధి పెంపొందించుకోవాలి      

గిరిజన నిరుద్యోగులైన ప్రతి యువకులు వ్యాపారంలో నష్టపోకుండా జీవనోపాధి పెంపొందించుకోవాలి      

 


జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్


నమస్తే భారత్: భద్రాచలం


నిరుద్యోగులైన గిరిజన యువతులు ప్రపంచంలో పోటీపడి డిమాండ్ ను బట్టి వ్యాపారం చేసి నష్టపోకుండా అధిక లాభాలు పొంది జీవనోపాధి పెంపొందించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం నాడు భద్రాచలంలోని ఐటిడిఏ ప్రాంగణంలోని వై టి సి లో గిరిజన యువతులు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మతో కలిసి యువతులకు వ్యాపారం లోని మెలకువలు సలహాలు సూచనలు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మీ గ్రామాలలోని మహిళల డిమాండ్ ను బట్టి బట్టలు డిజైనింగ్ చేయాలని, మహిళలందరూ ఐకమత్యంగా ఉండి ముక్కోటి శ్రీరామనవమి పండుగల సమయంలో మీరు తయారు చేసిన డిజైన్లను అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తానని,కుట్టు శిక్షణ నేర్చుకున్న యువతులకు హైదరాబాద్ పంపించి బొంబాయి మరియు పూణే రాష్ట్రాల నుండి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ తో మమేకం చేసి కొత్త కొత్త డిజైన్లు తయారు చేసే విధంగా శిక్షణలు ఇప్పించి హైదరాబాదులోని శిల్పారామంలో ప్రత్యేకంగా మీరు తయారు చేసిన బట్టల డిజైన్లను అమ్ముకునే విధంగా అవకాశం కల్పిస్తానని అన్నారు. ఉత్సాహవంతులైన మహిళలకు మీ గ్రామంలోని అంగన్వాడి సెంటర్, ప్రభుత్వ పాఠశాలల పక్కన కుట్టుమిషన్లకు సంబంధించిన వర్క్ షెడ్డు ఈజీఎస్ ద్వారా కట్టించుకొని ఇటు పిల్లల ఆలనా పాలన మరియు మీ యొక్క బట్టలు కుట్టుకునే వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు క్లస్టర్ వారిగా గ్రూప్స్ తయారు చేయించి మూడు క్లస్టర్లకు కలిపి ఎంబ్రాయిడరీ కి సంబంధించిన పెద్ద మిషన్ ఇప్పించడానికి కృషి చేస్తానని మహిళలందరూ ఎంబ్రాయిడరింగ్ శిక్షణ తీసుకొని నిష్ణాతులు కావాలని అన్నారు. 
అనంతరం పిఎంఆర్సి కార్యాలయం సందర్శించి కార్యాలయంలో గిరిజనులకు సంబంధించిన అన్ని రకాల సంక్షేమ పథకాల పెయింటింగ్ డిజైనింగ్ వేయించాలని, ముఖ్యంగా గిరిజనులకు పంపిణీ చేసే సంక్షేమ పథకాలు పోడు భూములకు సంబంధించిన జాబితా, నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణలు ఇప్పించే జాబితా మరియు గిరిజనులకు అన్ని విధాల ఉపయోగపడే అన్ని జాబితాలు రూపొందించి ప్రదర్శించాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ పనులు, టాయిలెట్స్ బాత్రూమ్స్, డ్రైనేజీ సమస్యలు లేకుండా పనులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శ్రీరామ జాయింట్ లియాబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్ ని సంప్రదించి ఇక్కడ తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయి వరకు వెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఐటీడీఏ భద్రాచలం పేరును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందని, అందుకు మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. ఇదే స్ఫూర్తితో ఎటువంటి కల్తీ లేని ఆర్గానిక్ తినుబండారాలు తయారు చేసి మ్యూజియం మరియు దేవస్థానం కు వచ్చే భక్తులకు అందించాలని అన్నారు. మిల్లెట్ బిస్కెట్లు తయారీ కొరకు కొనుగోలు చేసే ముడి సరుకుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు, నెయ్యి ఇతర వస్తువులు బయట నుండి కాకుండా మన పంట పొలాలలో రాగులు సజ్జలు పండించుకొవాలని, నెయ్యిని మాత్రం మన గ్రామాలలోనే పశుసంపద ఎక్కువగా ఉన్నందున స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేసుకోవాలని మహిళలకు సూచించారు. అలాగే మిల్లెట్ బిస్కెట్లకు సంబంధించిన బ్రాండింగ్ స్టిక్కర్లు సెలెక్ట్ చేసి ఐటిడిఏకు మంచి గుర్తింపు 
వచ్చేలా చూడాలని అన్నారు. 

అనంతరం మిల్లెట్ బిస్కెట్ తయారీ గ్రూప్ మహిళలు ప్రపంచమంతట భద్రాచలం ఐటిడిఏ తరపున మిల్లెట్ బిస్కెట్ల తయారీకి సంబంధించిన అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతగా పిఓ ఛాంబర్ లో ఐటీడీఏ పీవో బి రాహుల్, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ లకు మిల్లెట్ బిస్కెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో  ఏవో సున్నం రాంబాబు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఏసీఎంవో రమేష్, టి ఏ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, ఆర్ ఐ నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మిల్లెట్ బిస్కెట్ తయారీ మహిళలు వెంకటలక్ష్మి, లలిత, మంగ వేణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

షరతులకు రెండు దేశాలూ ఓకే షరతులకు రెండు దేశాలూ ఓకే
| ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని \జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలూ...
నావాడు, నీవాడు అంటూ
అబద్దాలు చెప్పడం బీజేపీ జాతీయ విధానం : సంజయ్‌ రౌత్‌
అందలం ఎక్కింది మీడియాతోనే ... మిమ్మల్ని తొక్కేది మీడియానే.. 
మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య
బడుగు,బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేయరాదు: జిల్లా ఎస్పీ