మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

 

మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయు) మఫీషియల్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జి. శ్రీనివాస్@పేపర్ శ్రీను

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్29:షాద్ నగర్ మీడియా పై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర మఫిషియల్ కమిటీ కన్వీనర్ గుడుపల్లి శ్రీనివాస్@పేపర్ శ్రీను డిమాండ్ చేశారు. ఆదివారం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో మహా న్యూస్ ఛానల్ పై జరిగిన దాడికి నిరసనగా షాద్ నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతుంటే వీధి రౌడీల్లా వచ్చి మీడియా ఛానళ్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచిన జర్నలిస్టులపై దాడులు చేయడం ఒక పిరికిపంద చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే న్యాయపరంగా లేదా అందుకు కౌంటర్ ఇవ్వాలే తప్ప దాడులు చేయడం సరైన సంస్కృతి కాదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం సమాచార సేవ చేస్తున్న మీడియా రంగాలపై  దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడి సంఘటనలు సభ్య సమాజంలో  తలదించుకునేలా ఉన్నాయని, పత్రికా స్వేచ్ఛను హరిస్తే వాస్తవాలు వెలుగులోకి ఎలా వస్తాయని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసే మీడియాపై దాడులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఎలక్ట్రానిక్ మీడియా షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు   ప్రధాన పక్షానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా పాటుపడాలి కానీ, వార్తా ప్రసార కథనాలను అడ్డంపెట్టుకుని మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం దాడి చేసిన వారిని పట్టుకుని తీవ్రంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని పేర్కొన్నారు. దాడులు చేసినంత మాత్రాన వాస్తవాలు బయటకు రాకుండా పోవని, నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయన్న విషయాలను ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) ప్రింట్ మీడియా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, జిల్లా కార్యదర్శి దన్నారం రమేష్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆకుల శ్రీనివాస్, అల్వాల దర్శన్, విష్ణు, నీరటి శివకుమార్, ఫయాజ్, ఇలియాస్, సమీ, సలీం, సాబీర్, శ్రీకాంత్, కాజా సోయల్, శ్రావణ్ గౌడ్, మహమ్మద్ రియాజ్, కార్తీక్, రమేష్, ఎక్బాల్ లు పాల్గొన్నారు.

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

షరతులకు రెండు దేశాలూ ఓకే షరతులకు రెండు దేశాలూ ఓకే
| ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని \జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలూ...
నావాడు, నీవాడు అంటూ
అబద్దాలు చెప్పడం బీజేపీ జాతీయ విధానం : సంజయ్‌ రౌత్‌
అందలం ఎక్కింది మీడియాతోనే ... మిమ్మల్ని తొక్కేది మీడియానే.. 
మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య
బడుగు,బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేయరాదు: జిల్లా ఎస్పీ