అందలం ఎక్కింది మీడియాతోనే ... మిమ్మల్ని తొక్కేది మీడియానే.. 

అందలం ఎక్కింది మీడియాతోనే ... మిమ్మల్ని తొక్కేది మీడియానే.. 

 

 కేటీఆర్ కు నేతల హెచ్చరిక.. 

 ఫోన్ ట్యాప్ తో దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేశావు: అందే బాబయ్య 

 మీడియాపై దాడులు సహించం : టియుడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు జే రాఘవేంద్ర గౌడ్ 

 దాడి చేసిన వారిని వదలవద్దు: బిసి సేన జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీను 

 చెల్లెలి ఫోన్ కూడా ట్యాప్ చేసిన చరిత్ర మీది: ప్రశాంత్ ముదిరాజ్ 
 
 మహా టీవీ పై దాడికి నిరసనగా పట్టణ కూడలిపై నాయకులు, సంఘాల నాయకులు 

 ఆందోళనకు హాజరైన బిజెపి బిజెవైఎం బీసీ సేన నాయకులు 

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్29:మీడియా సహకారంతోనే అందలం ఎక్కారు.. చివరికి మీడియా పైనే దాడులకు దిగుతున్నారు.. మిమ్ములను అందరం ఎక్కించింది మీడియానే.. చివరికి పాతాళానికి తొక్కేది కూడా మీడియానేనని మరిచిపోవద్దు.. అంటూ బీఆర్ఎస్ నాయకులను వివిధ సంఘాలు, పార్టీల నాయకులు హెచ్చరించారు. షాద్ నగర్ పట్టణంలో మహాటీవీ ఛానల్ పై బిఆర్ఎస్ మూక దాడిని నిరసిస్తూ బిసి నాయకులు పసుపుల ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం పట్టణ కూడలిపై ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మీడియా సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుల తీరు పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లిని ఫోన్ కూడా వదలరా..
ఫోన్ ట్యాపింగ్ ద్వారా అతిపెద్ద నేరానికి పాల్పడిన కేటీఆర్ చివరికి చెల్లెలి ఫోన్ కూడా ట్యాప్ చేయడం అత్యంత దారుణమని బిజెపి రాష్ట్ర నాయకుడు అందె బాబయ్య ధ్వజమెత్తారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసి ప్రైవసీని దెబ్బతీశారని విమర్శించారు. దీనిని వెలుగులోకి తెచ్చినందుకు మహా టీవీ కార్యాలయంపై దాడికి పాల్పడడం, అక్కడున్న వారిని బెదిరింపులకు గురి చేయడం అత్యంత దారుణమైన చర్య అని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా ఛానళ్లు, పత్రికలు, పాత్రికేయుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చట్టాన్ని కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి నాయకుల, పాత్రికేయుల స్వేచ్ఛను గౌరవిస్తుందని, నిరంతరం వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
పాత్రికేయులకు స్వేచ్ఛ కరువైంది: రాఘవేందర్ గౌడ్ 
నిజాలను నిర్భయంగా రాసే పాత్రికేయులకు స్వేచ్ఛ కరువైందని వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంగెం రాఘవేందర్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాలనలో నిజాలు రాసే పాత్రికేయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు నమోదు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ప్రతిపక్షంలో ఉండి కూడా పని కట్టుకొని పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. రాను రాను పాత్రికేయుల స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా ఛానళ్లకు, పాత్రికేయులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
 దాడి చేసిన వారిని వదలవద్దు: బిసి సేన జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీను మహా టీవీ పై దాడి చేసిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని బీసీ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీను హెచ్చరించారు. ఆందోళనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహా టీవీ యాజమాన్యంపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం ఒకటేనని అన్నారు. నాయకులు కండకావరంతో కొట్టుకుంటున్నారని ఇలాంటివారిని ఉపేక్షించకూడదని గెలు శ్రీనివాస్ తదితరులపై చట్టరీత్యా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఊరుకునేది లేదు: ప్రశాంత్ ముదిరాజ్ 
స్వేచ్ఛాయుతంగా పనిచేసే పత్రిక వ్యవస్థ పై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడితే సహించేది లేదని బిజెపి యువ నాయకుడు ప్రశాంత్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు, చట్టాలు, న్యాయస్థానాలకు ఉన్నట్లే సమాన హక్కులు పాత్రికేయ వ్యవస్థకు ఉన్నాయని, దేశానికి నాలుగు మూల స్తంభాలలో పాత్రికేయ వ్యవస్థ కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదు అన్నారు. ఇకనైనా దూకుడు తగ్గించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
 శిక్షించాల్సిందే:ప్యాట అశోక్ 
మహా టీవీ ఛానల్ కార్యాలయం పై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులను కఠినంగా శిక్షించాల్సిందేనని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ప్యాట అశోక్ డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛపై దాడికి దిగితే  పరిణామాలు ఎలా ఉంటాయో నాయకులకు తెలిసి రావాలని అన్నారు. ఈ దేశంలో పాత్రికేయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నందుకే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పత్రికా వ్యవస్థ లేకపోతే అవినీతికి అంతే ఉండదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాత్రికేయులకు నిరంతరం అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్ట్ నాయకులు సరాపు రమేష్, నరసింహారెడ్డి, బీసీ సేన నాయకుడు కత్తి చంద్రశేఖర అప్ప, జయ శ్రీకాంత్, చెన్నగల బాల్ రాజ్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆకాష్ యాదవ్, చందు, భాగ్యలక్ష్మి, స్రవంతి, బాలు, వెంకటేష్ బీసీ నేత బిజేపి నాయకులు పసుపుల ప్రశాంత్ ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమానికి బిజెపి షాదద్ నగర్ ఇంచార్జ్ అందే బాబయ్య యువ నాయకులు ప్యాట అశోక్ బోయ.కురుమయ్య జమ్ముల నరసింహ, మంగ విజయ్ ,పద్మ కృష్ణయ్య, మీడియా మిత్రులు సరపు రమేష్, రాఘవేందర్ గౌడ్, నరసింహారెడ్డి, బాలు, రాము, బిసి సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు  కత్తి చంద్రశేఖర్ అప్ప, జయ శ్రీకాంత్, మేకల వెంకటేష్, వెంకటేష్ గౌడ్ బాలరాజ్ శివ చందు శ్రీనివాస్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

షరతులకు రెండు దేశాలూ ఓకే షరతులకు రెండు దేశాలూ ఓకే
| ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని \జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలూ...
నావాడు, నీవాడు అంటూ
అబద్దాలు చెప్పడం బీజేపీ జాతీయ విధానం : సంజయ్‌ రౌత్‌
అందలం ఎక్కింది మీడియాతోనే ... మిమ్మల్ని తొక్కేది మీడియానే.. 
మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య
బడుగు,బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేయరాదు: జిల్లా ఎస్పీ