పింఛన్లు పేదలకు ఆర్థిక భరోసా ను అందిస్తాయి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
పేదలకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు ఆర్థిక భరోసా ను, సామాజిక భద్రతను అందిస్తాయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రానికి సమీపంలో గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో చేయూత పథకంపై అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీ వోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, సెక్షన్ సిబ్బంది, పోస్టల్ శాఖ సిబ్బందికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేయూత పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ పథకాన్ని వర్తింప చేయాలని సూచించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సూచించిన పారా మీటర్స్ ను ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, పింఛన్ల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తోందన్నారు. చనిపోయిన వారి వివరాలను సేకరించి వారి స్థానంలో కుటుంబ సభ్యులలో అర్హులైన వారు ఉంటే వారికి పింఛన్ మంజూరు చేయాలన్నారు. మంజూరుకు సంబంధించి ఎంపీడీవోలు కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో పింఛన్ల కోసం ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై పూర్తిగా దృష్టి సారించి, అన్ని సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆమె సూచించారు. జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, మాగనూర్ మండలాలతోపాటు నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీలలో ఈ పథకం అమలులో లోటు పాట్లను సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెర్ఫ్ డైరెక్టర్ గోపాలరావు చేయూత పథకం లో అర్హుల ఎంపిక, మంజూరు కు పాటించాల్సిన నిబంధనలు, చనిపోయిన వారి వివరాల అప్ డేట్ గురించి క్లుప్తంగా వివరించారు. అంతకుముందు డిఆర్డిఓ మొగులప్ప జిల్లాలో 75,265 (అన్ని రకాల) పింఛన్లు ఉన్నాయని, వారికి ప్రతి నెలా 19.35 కోట్లు చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
