ఘనంగా పి.ఎల్.రాజు జయంతి

ఘనంగా పి.ఎల్.రాజు జయంతి

* ప్రతిభ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం
* పేద రోగులు,విద్యార్థులకు సాయం అందజేత
నమస్తే భారత్, పోడూరు మే - 28: 
ప్రముఖ దాత, పారిశ్రామికవేత్త పిఎల్ రాజు జయంతి వేడుకలు  జిన్నూరులో పెనుమత్స సీతమ్మ స్మారక భవనంలో ఘనంగా నిర్వహించారు. పారిశ్రామికవేత్త పెనుమత్స రామచంద్ర రాజు, సొసైటీ మాజీ అధ్యక్షులు పెనుమత్స సుబ్బరాజు, ప్రోగ్రాం  కన్వీనర్ పెనుమత్స బుద్ధరాజు, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సిహెచ్ శివ జ్యోతి, పి ఎల్ రాజు కుటుంబ సభ్యులు తదితరులు పి ఎల్ రాజు, సీతమ్మ పుణ్య దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిఎల్ రాజు జయంతి సందర్భంగా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు గోపాలరాజు(గోపి), వెంకటపతిరాజు(వర్మ)  జిన్నూరు, పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన పేద రోగులకు, వృద్ధులకు, పేద విద్యార్థులకు, ప్రతిభ కనబరిచిన  విద్యార్థులకు ఆర్థిక సాయం, నగదు బహుమతులుగా సుమారు రూ.1.40 లక్షలు పంపిణీ చేశారు. జిన్నూరు, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లోని 25మంది పేదలకు రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక ఏఎస్ఆర్ జడ్పీ హైస్కూల్ లో గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 571 మార్కులతో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థి గుప్తాకు, 520 మార్కులతో మండల స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన జి. హైమావతికి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన పాలకొల్లు చాంబర్స్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి లక్ష్మణ్ కు.రూ. 5వేల నగదు బహుమతి అందజేశారు. పలువురు  పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందజేశారు. పారిశ్రామికవేత్త  రామచంద్రరాజు, సొసైటీ మాజీ అధ్యక్షులు సుబ్బరాజు, పెనుమత్స గోపాలం,  ప్రోగ్రాం కన్వీనర్ బుద్ధరాజు, పీఎల్ రాజు కుటుంబ సభ్యుల  చేతులమీదుగా మెరిట్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం, పేదలకు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త రామచంద్రరాజు మాట్లాడుతూ చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడి , స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయులు  పిఎల్ రాజు అని కొనియాడారు. పారిశ్రామికవేత్తగా హైదరాబాదులో స్థిరపడినా సొంత ఊరును మర్చిపోకుండా  కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామ అభివృద్ధికి  పి ఎల్ రాజు ఎంతో సహకారం అందించారన్నారు. అలాగే మెరిట్ విద్యార్థులకు, పేద విద్యార్థులకు, నిరుపేదలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. సొసైటీ మాజీ అధ్యక్షులు సుబ్బరాజు మాట్లాడుతూ పి ఎల్ రాజు, ఆయన కుమారులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు జిన్నూరు గ్రామానికే ఎంతో గర్వకారణం అన్నారు.  పి ఎల్ రాజు అడుగుజాడల్లోనే ఆయన కుమారులైన గోపి, వర్మ కూడా విద్యార్థులకు, పేద రోగులకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏ ఎస్ ఆర్ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం శివజ్యోతి మాట్లాడుతూ   పి ఎల్ రాజు కుటుంబం చాలా ఏళ్లుగా హైదరాబాదులో స్థిరపడినప్పటికీ కన్నతల్లి లాంటి సొంతఊరును మర్చిపోకుండా అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో 10వ  తరగతి పబ్లిక్ పరీక్షల్లో  ప్రతి ఏటా అత్యుత్తమ మార్కులతో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 10వేలు నగదు బహుమతులు అందించడం పట్ల  పి ఎల్ రాజు కుటుంబానికి  కృతజ్ఞతలు తెలిపారు. కన్వీనర్ బుద్ధరాజు మాట్లాడుతూ  పి ఎల్ రాజుకు  చిన్నతనం నుంచి పేద ప్రజలు అంటే ఎంతో ప్రేమ చూపించే వారన్నారు. పుట్టిన ఊరి పట్ల ఎంతో మమకారం చూపించే వారన్నారు. సతీమణి సీతమ్మ పేరుతో ఆసుపత్రి భవనం నిర్మించడంతోపాటు, గ్రామంలో ప్రధాన స్మశానవాటిక అభివృద్ధికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారన్నారు. వారి కుమారులు కూడా తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు
* వేడంగిలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన పద్మారావు * నమస్తే భారత్  న్యూస్, పోడూరు మే- 28 :కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు...
మరిపెడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వీడాలి 
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి
మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి:
సమాజ సేవలో శ్రీమంతుడు శ్రీ.బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారికి గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
జగన్ విధ్వంసాన్ని సృష్టిస్తే.. చంద్రబాబు అభివృద్ధిని అందిస్తున్నారు : రాష్ట్ర మంత్రి నిమ్మల