సీజనల్ వ్యాధుల పట్ల ఫరూఖ్ నగర్ మండల సమన్వయ సమీక్ష సమావేశం 

సీజనల్ వ్యాధుల పట్ల ఫరూఖ్ నగర్ మండల సమన్వయ సమీక్ష సమావేశం 

 

 జె.రామారావు స్పెషల్ ఆఫీసర్ ఎం. బన్సీలాల్ ఎం.పీ.డీ.వో 

 డాక్టర్ వి.విజయలక్ష్మి 
 డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ 

  నమస్తే భారత్ షాద్ నగర్ జూన్27:జిల్లా కలెక్టర్ సి .రంగారెడ్డి ఆదేశానుసారం , ఈరోజు షాద్ నగర్ డివిజన్లోని  మండల ప్రజా పరిషత్ ఫరూక్ నగర్ కార్యాలయంలో,మండల ప్రత్యేక అధికారి  జె.రామారావు అధ్యక్షతన, సీజనల్ వ్యాధులు గురించి, వన మహోత్సవము మరియు వ్యవసాయ శాఖ కార్యక్రమాల గురించి సమన్వయ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ జె .రామారావు మాట్లాడుతూ మండల్ లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ మరియు పంచాయతీరాజ్ ఆరోగ్య శాఖ సమన్వయముతో గ్రామాలలో ఎక్కడ  మురికినీళ్ళు నిలవకుండా,  చెత్తాచెదారం లేకుండా , దోమలు పుట్టకుండా,  పెరగకుండా,  మరియు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఎక్కడైతే మురికి  గుంటలు మరియు చెత్త కుప్పలు ఉన్నాయో,  వాటి గుర్తించి వెంటనే పరిశుభ్రంగా చేయాలని తెలియజేశారు. ఎంపీడీవో బనిశిలాల్  మాట్లాడుతూ విలేజ్ సెక్రటరీ వారు మరియు ఆశావాలు , ఇద్దరి సమన్వయంతో గ్రామాలలో ఎక్కడ కూడా దోమలు పెరగకుండా ఉండాలంటే,  గ్రామాలలో ఉన్న మురికి కుంటలను , చెత్తాచెదారం మొత్తం గుర్తించి,  క్లీన్ చేయాలని తెలియజేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు మాట్లాడుతూ దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులని చెప్పారు . దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా (బోదవ్యాధి), డెంగ్యూ,  మెదడువాపు,  చికెన్ గునియా మరియు జీగా వ్యాధులు వ్యాపిస్తాయని తెలియజేశారు. మన ఇళ్ల పరిసరాలలో సాధారణంగా అనాఫిలిస్ , క్యూలెక్స్ ,  ఏడీస్ దోమలు పెరుగుతాయని చెప్పారు. అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుందని, క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల ఫైలేరియా వ్యాధి (బోధ వ్యాధి) వస్తుందని, అలాగే ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరము మరియు చికెన్ గునియా వ్యాధి వస్తుందని తెలియజేశారు. అందువలన గ్రామాలలో దోమలు పుట్టకుండా,  కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడాలని , కిటికీలకు,  వెంటిలేటర్లకు మెస్ జాలీలు బిగించాలని మరియు శరీరమునకు కాటన్ నిండు దోస్తులు ధరించాలని తెలియజేశారు. దోమలు పుట్టకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ఫ్రైడే .. డ్రైడే కార్యక్రమం నిర్వర్తించాలని, ఫ్రైడే ..డ్రైడే కార్యక్రమంలో ఇంటి ముందున్న కావులలో,  హౌస్లలో మరియు వర్షపు నీళ్ళు టైర్లలో, కొబ్బరి చిప్పలలో, పగిలిన కుండలలో నీరు  నిల్వ ఉండకుండా చూసినట్లయితే , దోమలు పెరగకుండా ఉంటాయని తెలియజేశారు. గ్రామాలలో,  వీధులలో మురికి గుంటలు,  ఉన్న దగ్గర టీమోఫాస్ 5 మిల్లీలీటర్లు,  10 లీటర్ల నీరులో కలిపి స్ప్రే చేయడం ద్వారా దోమల యొక్క లార్వాలు, దోమలు చనిపోతాయని చెప్పారు. అలాగే మలాథియాన్ 1 లీటర్ ద్రావణం,  19 లీటర్ల డీజిల్ లో కలిపి ఫాగింగ్ చేయడం వల్ల దోమలు సంపూర్ణంగా చనిపోతాయని తెలియజేశారు. ఎక్కువ మురికి గుంటలు ,నీరు నిల్వ ఉన్న వాటిలో నూనె బంతులు (ఆయిల్ బాల్స్) తయారుచేసి అందులో వేయడం వల్ల దోమలు గుడ్లు పెట్టినవి , లార్వా,  ప్యూప మరియు దోమ గా మారకుండా చనిపోతాయని తెలియజేశారు. వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా ఉండటం వల్ల కలుషిత ఆహారం వలన,  కలుషితమైన నీటి వలన డయేరియా వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క ఇండ్లలో ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని కాచి చల్లార్చి తాగాలని జె .శ్రీనివాసులు తెలియజేశారు.
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి  మాట్లాడుతూ ఈ దోమల వలన మలేరియా,  డెంగ్యూ,  చికెన్ గునియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని, అందువలన ఎవరికైనా ఈ సీజన్లో జ్వరము,  తలనొప్పి , ఒళ్ళు నొప్పులు, కండరాలను నొప్పులు ఉన్నవాళ్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి మలేరియా,డెంగ్యూ పరీక్షలు చేయించుకున్నట్లయితే,  వారికి ఉన్న వ్యాధి బయటపడుతుందని తెలియజేశారు. అప్పుడు వ్యాధి ఉన్నవారు వైద్యాధికారిని కలిసి సరైన చికిత్స తీసుకున్నట్లయితే ప్రమాదవశాత్తు నుండి బయటపడవచ్చు అని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి ,  అందువలన,  పై లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్ష చేసుకొని తగు చికిత్స వైద్య అధికారితో తీసుకోగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జె రామారావు,ఎంపీడీవో బనిశిలాల్ ,  డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ  డాక్టర్ వి.విజయలక్ష్మి,ఎం పి ఓ జయంత్ రెడ్డి,అగ్రికల్చర్ ఆఫీసర్ నిశాంత్ కుమార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది,వైద్యాధికారులు డాక్టర్ స్రవంతి,  డాక్టర్ రాఘవేందర్, హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు, ఎం.ఎల్.హెచ్.పి .వైద్య అధికారులు,  విలేజి స్పెషల్ ఆఫీసర్లు,  ఐసిడిఎస్ సూపర్వైజర్లు,  హెల్త్ సూపర్వైజర్లు,  విలేజ్ సెక్రటరీలు మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేటలో గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్ విడుదల పాపన్నపేటలో గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్ విడుదల
మెదక్,జూన్27(నమస్తే భారత్): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి గాను శుక్రవారం రోజు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆఫీస్ కు తరలి వెళ్తున్న పంచాయతీ కార్మికులను పాపన్నపేట...
అవసరమైతే నా ఇల్లు కూడా అమ్ముతా, నేను మీ బిడ్డను: మంత్రి వాకిటి శ్రీహరి.... 
పోలీస్ జాగిలాల నూతన గదులను ప్రారంభించిన: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్
నేడు మండలానికి మంత్రి రాక
పార్టీ సిపిఐ మూడవ మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రాల విడుదల 
ఉద్యమకారులు సాయి చందువిగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్,ప్రెసిడెంట్ కేటీఆర్ రాక, మాజీత్రివర్యులు,హరీష్ రావు, రక, 
సీజనల్ వ్యాధుల పట్ల ఫరూఖ్ నగర్ మండల సమన్వయ సమీక్ష సమావేశం