జగన్ విధ్వంసాన్ని సృష్టిస్తే.. చంద్రబాబు అభివృద్ధిని అందిస్తున్నారు : రాష్ట్ర మంత్రి నిమ్మల 

జగన్ విధ్వంసాన్ని సృష్టిస్తే.. చంద్రబాబు అభివృద్ధిని అందిస్తున్నారు : రాష్ట్ర మంత్రి నిమ్మల 


* యలమంచిలి మండలం శిరగారపల్లి లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, భూమిపూజ 
* ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ నిర్లక్ష్యంపై మంత్రి విమర్శ
* వైసిపి నాయకుల మాయమాటలు నమ్మొద్దు అని హితవు 
 నమస్తే భారత్,పోడూరు మే -28: గత వైసిపి ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తే.. ఎన్డీఏ కూటమి పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అభివృద్ధి పథకాలను అందిస్తున్నారని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి  ప్రజా వేదికను కూల్చి విధ్వంసానికి పాల్పడితే.. తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టును  సందర్శించి డిసెంబర్ 2027 నాటికల్లా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసే దిశగా పునర్మాణానికి పూనుకున్నారని.. గత వైసిపి పాలనకు, నీటి కూటమి పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని మంత్రి రామానాయుడు విమర్శించారు. యలమంచిలి మండలం శిరగారపల్లి గ్రామంలో శనివారం రూ. 95 లక్షల వ్యయంతో రెండు  అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, తాగునీటి పథకానికి సంబంధించిన ఒక పనికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన, ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నారన్నారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల రెట్టింపు చేయడం చారిత్రాత్మకం అన్నారు. గత ప్రభుత్వంలో రూ.వెయ్యి పెంచడానికి ఐదేళ్లు కాలయాపన చేస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మొదటి నెలలోనే రెట్టింపు చేయడంతో నెలకు రూ. 3000 కోట్లు, ఐదేళ్లకు ఒక లక్ష 80 కోట్ల రూపాయలు కోట్ల వెచ్చిస్తున్నారన్నారు. గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేయని దుస్థితిలో చంద్రబాబు 16 వేలకుపైగా పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి విద్యార్థి తల్లిదండ్రులను మోసగించారు అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం చంద్రబాబు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం  సొమ్మును అందిస్తున్నారు అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని, త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామనడానికి సంతోషిస్తున్నామని, రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్మును త్వరలోనే అందిస్తామన్నారు. నియోజక ప్రజల ఆశీర్వాదంతో ఇరిగేషన్  శాఖ మంత్రిగా కాలువలు,డ్రైన్ల పూడికతీత, కాలువ గట్ల పటిష్టతకు రూ.100 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామన్నారు. గత ఐదేళ్ల పాలనలో గోదావరి వరద ఉధృతికి అనేక గ్రామాలు ముంపు గురవుతున్న రూపాయి ఖర్చు చేసి తట్ట మట్టి తీసి పూడికతీత పనులు చేపట్టిన దాఖలా లేవన్నారు. వైసీపీ మంత్రులు, నాయకులు చూసి వెళ్లడమే తప్ప రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన పరిస్థితి లేదన్నారు. వైసీపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వాసానికి, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి తేడాను గుర్తించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని హితవు పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ మామిడిశెట్టి  పెద్దిరాజు, యూనిట్ ఇన్చార్జి చిలుకూరి బాలాజీ, జనసేన మండల అధ్యక్షుడు వరబాబు, బిజెపి అధ్యక్షుడు చంటి, యూనిట్ ఇన్చార్జి మాజీ జడ్పిటిసి సభ్యుడు బోణం నాని, నాయకులు ఆరిమిల్లి రామశ్రీనివాసు, కడలి గోపాలరావు, పీతల  శ్రీనివాస్ మాతా రత్నరాజు, చిట్టూరి సీతారామాంజనేయులు, ప్రేమ్ కుమార్, చిలుకూరు అంజిబాబు, పిచ్చెట్టి వెంకటేశ్వరరావు తోటకూర నరసింహారావు, తమ్మినీడి సీతారాముడు, పెన్మత్స రామభద్ర రాజు, వివిధ శాఖల అధికారులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు  గ్రామస్తులు పాల్గొన్నారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు
* వేడంగిలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన పద్మారావు * నమస్తే భారత్  న్యూస్, పోడూరు మే- 28 :కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు...
మరిపెడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వీడాలి 
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి
మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి:
సమాజ సేవలో శ్రీమంతుడు శ్రీ.బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారికి గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
జగన్ విధ్వంసాన్ని సృష్టిస్తే.. చంద్రబాబు అభివృద్ధిని అందిస్తున్నారు : రాష్ట్ర మంత్రి నిమ్మల